కాజల్-బెల్లంకొండ.. ముచ్చటగా మూడోసారి

వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన కవచం సినిమా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. దీంతోపాటు తేజ దర్శకత్వంలో వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్నారు. ఇప్పడీ రెండు సినిమాలతో పాటు కాజల్-బెల్లంకొండ కాంబోలో ముచ్చటగా మూడో సినిమా కూడా రాబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా కాజల్ బయటపెట్టింది.

"సాయి శ్రీనివాస్ తో ఎన్ని సినిమాలైనా చేయొచ్చు. అతడితో వర్క్ చేయడం అంత కంఫర్టబుల్ గా ఉంటుంది. నేను, సాయిశ్రీనివాస్ ఒకేలా ఆలోచిస్తాం. మా ఇద్దరి మైండ్ సెట్ ఒకేలా ఉంటుంది. అతడితో మరో సినిమా కూడా చేయబోతున్నాను."

ఇలా బెల్లంకొండతో మరో సినిమా చేయబోతున్న విషయాన్ని కాజల్ బయటపెట్టింది. అయితే ఆ సినిమా వివరాలు మాత్రం బయటపెట్టడానికి కాజల్ ఇష్టపడలేదు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు చర్చల దశలో ఉందని, అగ్రిమెంట్లు పూర్తయిన తర్వాత వివరాలు చెబుతానంటోంది.

తన సినిమాలు ఎలా ఉన్నప్పటికీ స్టార్ హీరోయిన్లను మాత్రం మిస్ చేసుకోడు బెల్లంకొండ. ఒకట్రెండు సినిమాలు మినహాయిస్తే, కెరీర్ స్టార్టింగ్ నుంచి ఈ హీరోది ఇదే ఫార్ములా. అదే పద్ధతిలో ఇప్పుడు కాజల్ ను వరుసగా మూడోసారి రిపీట్ చేస్తున్నాడు.

తెలంగాణ వోటింగ్ ఇవాలే... ముళ్లు ఎటువైపు తిరుగనుంది?

Show comments