పూరి జగన్నాధ్-రామ్ ల కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా డేట్ ఫిక్స్ అయింది. జూలై 12. ఇదేరోజున పోటీకి దిగాల్సిన శర్వానంద్-సుధీర్ వర్మల రణరంగం సినిమా ఆగస్ట్ ఫస్ట్ వీక్ కు వెళ్లిపోయింది. శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, చార్మి కౌర్ ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలై ఔట్ స్టాండ్ రెస్పాన్స్ను రాబట్టుకుంది. టైటిల్ రోల్లో నటించిన రామ్ టెరిఫిక్ షో చేశాడని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసి దర్శక నిర్మాతలు ఈ చిత్రాన్ని జూలై 12న విడుదల చేస్తున్నారు.
మూడు పాటల చిత్రీకరణ చేయాల్సి ఉంది. ఈ పాటలను హైదరాబాద్లో భారీ సెట్స్ వేసి చిత్రీకరించబోతున్నారు. నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్స్గా నటించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.
పదేళ్ల రాజకీయ ప్రస్థానం అద్భుత మలుపు