కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఆయనేనా!

ఏపీలో నామినేటెడ్ పోస్టులను ఒక్కొక్కటిగా భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్ నియామకాలు కూడా సాగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఈ నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నవారు కొందరు తప్పుకున్నారు. అప్పట్లో ఆ హోదాల్లో జగన్ మీద ఇష్టానుసారం పేట్రేగిన కొంతమంది ఇప్పుడు రోషంతో రాజీనామాలు చేసి వెళ్లిపోయారు.

అయితే కొందరు మాత్రం ఆ పదవులను పట్టుకుని వేలాడుతూ ఉన్నారు. ఆ సంగతలా ఉంటే.. ఖాళీ అయిన కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు ఖరారు చేశారట సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు రాజాకు సమాచారం అందిందని సమాచారం. జక్కంపూడి ఫ్యామిలీ ఆది నుంచి జగన్ వెంట నిలిచింది. ఇటీవలి ఎన్నికల్లో రాజా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన మంత్రి పదవినే ఆశించారు.

అయితే కాపు కోటాలో వేరేవాళ్లు ఆ పదవులను సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవిని రాజాకు కేటాయిస్తూ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని, రేపోమాపో ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ కాబోతున్నాయని సమాచారం.

ఆమెను ఆమెగా ప్రేమించేవాడే కావాలట..!

ఎన్ని సినిమాలు పోయినా తీస్తూనే ఉంటా..