జగన్, పవన్ ల సమావేశం జరిగిందట!

తెలుగుదేశం పార్టీకి ఇలాంటి ఇన్ఫర్మేషన్లు ఎక్కడ నుంచి వస్తాయో కానీ.. ఆ పార్టీ తరఫు నుంచి చిత్రవిచిత్రమైన ఆరోపణలు వస్తూ ఉంటాయి. తమ ప్రత్యర్థుల విషయంలో అలివిగాని ఆరోపణలు చేస్తూ ఉంటారు టీడీపీ నేతలు. డైరెక్టుగా టీడీపీ నేత కాదు కానీ, ఆ పార్టీ సానుభూతి పరుడిగా మాట్లాడే ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ కొత్త విషయాన్ని చెబుతున్నాడు.

ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ల సమావేశం జరిగిందని ఈయన అంటున్నాడు. విశాఖ వేదికగా ఈ సమావేశం జరిగిందని ఈయన చెబుతున్నాడు. వట్టి రవి ఇంట్లో జగన్, పవన్ లు కలిసి మాట్లాడారని కూడా ఈయన చెప్పుకురావడం విశేషం. వారి మధ్య పొత్తు, సీట్ల చర్చలు జరిగాయని ఈయన చెప్పుకొచ్చాడు.

జగన్ కొన్ని సీట్లను ఆఫర్ చేశాడని.. అయితే పవన్ కల్యాణ్ కు ముఖ్యమంత్రి పీఠం మీద కన్ను ఉందని.. అందుకే పొత్తుకు ఒప్పుకోలేదని కూడా ఈయన చెప్పుకొచ్చాడు. మరి ఇంత పక్కా ఇన్ఫర్మేషన్ ఈయనకు ఎక్కడ నుంచి వచ్చిందో మాత్రం చెప్పలేదు.

జగన్ , పవన్ లు కలిస్తే అది కులం మీద ఏర్పాటు చేసే వేదిక అవుతుందని ఈయన చెప్పుకొచ్చాడు. అదే కాంగ్రెస్ తో టీడీపీ చేతులు కలపడం మాత్రం ఒక బలమైన కూటమిని ఏర్పరచడం అని చెప్పుకొచ్చాడు!

ఆ టికెట్ల విషయంలో కుటుంబ పోరు!... చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్  

Show comments