జగన్ తొలికానుక.. 25 జిల్లాలు?

అఖండ మెజార్టీతో వైకాపాను ప్రజలు అక్కున చేర్చుకుని, జగన్ ను సిఎమ్ ను చేసారు. మరి జగన్ తొలిసారిగా జనాలకు ఏం కానుక ఇవ్వబోతున్నారు? నవరత్నాల అమలుకు శ్రీకారం చుడతారు. అది ఓకె. ఇంకా ఏమిటి? ప్రతి ఎంపీ స్థానానికి ఒక జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడానికి, అంటే జిల్లాల పునర్వవస్థీకరణ చేస్తానని జగన్ తన ఎన్నికల ప్రచారంలో స్పష్టమైన హామీ ఇచ్చారు. అనకాపల్లి లాంటి చోట్ల అయితే క్లియర్ గా జిల్లా కేంద్రం చేస్తా అని హామీ ఇచ్చారు. 

జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కొత్త జిల్లాల ప్రకటన లేదా జిల్లాల పునర్వవస్థీకరణను ప్రకటిస్తారని, నేరుగా కొత్త జిల్లాలను ప్రకటించడం లేదా, పునర్వవస్థీకరణ ప్రక్రియను ప్రారంభించడం కానీ ప్రకటిస్తారని తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో పార్వతీపురం, అరకు (గిరిజన జిల్లా), అనకాపల్లి, తూర్పుగోదావరిలో రాజమండ్రి, పశ్చిమగోదావరిలో భీమవరం లాంటి ఊళ్లు జిల్లా కేంద్రాలుగా మారే అవకాశం వుంటుంది. 

Show comments