అరె.. ఒక్కరోజు కూడా గ్యాప్ తీసుకోలేదు

రెండు సినిమాల మధ్య ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వలేదు బాలకృష్ణ. పైసా వసూల్ సినిమాకు నిన్ననే గుమ్మడికాయ కొట్టాడు. ఈరోజు నుంచి మరో సినిమా స్టార్ట్ చేస్తున్నాడు. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో కొత్త సినిమాను ఈరోజు నుంచి సెట్స్ పైకి తీసుకొస్తున్నాడు బాలయ్య. రామోజీ ఫిలింసిటీలో ఈ షూటింగ్ ప్రారంభం అవుతుంది. 

పూరి జగన్నాథ్ ఎంత ఫాస్ట్ గా సినిమాలు కంప్లీట్ చేస్తాడో అందరికీ తెలిసిందే. అంతకంటే ఫాస్ట్ గా బాలయ్య కూడా వర్క్ చేశాడట. అందుకే పైసా వసూల్ మూవీ అనుకున్న టైమ్ కంటే ముందే రెడీ అయింది. చెప్పిన టైమ్ కంటే 3 వారాల ముందే విడుదలవుతోంది. ఇప్పుడు అదే జోష్ లో కేఎస్ రవికుమార్ సినిమాను కూడా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాడు బాలకృష్ణ. 

యూనిట్ లో అంతా స్పీడ్ గానే ఉన్నారు కానీ వాళ్ల జోరుకు బ్రేకులేసే హీరోయిన్ కూడా అదే యూనిట్ లో ఉంది. ఆమె మరెవరో కాదు నయనతార. బాలయ్య సరసన మరోసారి హీరోయిన్ గా నటించబోతున్న నయనతార.. చెప్పిన టైమ్ కు కాల్షీట్లు ఇస్తుందా అనేది డౌట్. 

గతంలో వెంకీ హీరోగా నటించిన బాబు బంగారం సినిమా లేట్ అవ్వడానికి నయనతారే కారణం. తమిళ, మలయాళ సినిమాలకు ఇంపార్టెన్స్ ఇచ్చే నయన్, వీలుచిక్కినప్పుడు మాత్రమే తెలుగు సినిమాలు చేస్తుంది. ఇప్పుడు బాలయ్య సినిమాను కూడా అదే కేటగిరీలో చూస్తే యూనిట్ కు చిక్కులు తప్పవు.

Show comments