హనీ ట్రాప్ లో హీరోయిన్లు.. తేలు కుట్టిన దొంగల్లా నేతలు!

మధ్యప్రదేశ్ లో వెలుగు చూసిన హనీట్రాప్ లాంటిదే కర్ణాటకలోనూ ఒకటి బయటకు వచ్చింది. పలువురు రాజకీయ నేతల దగ్గరకు అందమైన అమ్మాయిలను పంపించి, వారి రాసలీలలను ఒక ముఠా రికార్డు  చేయించిందని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి ఒకడు పోలీసులకు చిక్కాడు.

ఎవరో ఒకరు చేసిన ఫిర్యాదుతో వాడి బండారం బట్టబయలు అయ్యింది. తన గర్ల్ ఫ్రెండ్ ను  మొదలుకుని పలువురు అమ్మాయిలను వాడి అతడు హనీ ట్రాప్ పన్నాడని పోలీసులు కనుగొన్నారు. అనేక మంది రాజకీయ నేతలు, ప్రముఖులను ఇలా టార్గెట్ చేశాడట. 

సంచలన అంశం ఏమిటంటే.. అతడి ఎరగా వేసిన వారిలో హీరోయిన్లు కూడా ఉన్నారనేది. దక్షిణాదిన పేరు తెచ్చుకున్న కొంతమంది హీరోయిన్లను కూడా నేతలకు, ప్రముఖులకు అతడు ఎరగా వేశాడని తెలుస్తోంది. ఆ రాసలీలలను కూడా చిత్రీకరించి.. బ్లాక్ మెయిలింగ్ లకు పాల్పడినట్టుగా తెలుస్తోంది.

అయితే ఈ వ్యవహారంపై పోలీసుల విచారణ సాగుతూ ఉంది, అనేక మంది ప్రముఖులు, కర్ణాటక  రాజకీయ నేతలు, ఎమ్మెల్యేలు ఈ హనీ ట్రాప్ లో చిక్కుకున్నట్టుగా వారు గుర్తించారు. వారిని బెదిరించి ఆ ముఠా డబ్బులు వసూలు చేసినట్టుగా పోలీసులు కనుగొన్నారు.

అయితే ఇప్పటి వరకూ బాధితుల నుంచి మాత్రం ఫిర్యాదులు లేవు. తమను ఒక ముఠా అలా బ్లాక్ మెయిల్ చేసిందంటూ ఎవ్వరూ పోలీసులుకు ఫిర్యాదులు చేయడం లేదు. అదెందుకో వేరే చెప్పనక్కర్లేదు. తాము ఆ హనీ ట్రాప్ లో చిక్కుకున్నట్టుగా ఎవ్వరూ ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నారు. అలా చెప్పుకుంటే పోయేది తమ పరువే అని ఆ 
రాజకీయ నేతలు భావించడం వింత ఏమీ కాదు. తేలు కుట్టిన దొంగల్లా తయారైందట ఆ రాజకీయ నేతల పరిస్థితి.

Show comments