తాను కూడా లైంగిక బాధితురాలినే అని సీనియర్ హీరోయిన్ కస్తూరి ఆవేదన వ్యక్తం చేశారు. నిప్పురవ్వ , అన్నమయ్య ,డాన్ శీను తదితర తెలుగు చిత్రాల్లో కస్తూరి నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. ప్రస్తుతం ‘గృహలక్ష్మి’ తో పాటు మరికొన్ని సీరియల్లో ఆమె నటిస్తున్నారు.
తాజాగా కస్తూరి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఇటీవల బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్పై హీరోయిన్ పాయల్ ఘోష్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పాయల్ ఆరోపణలకు కంగనా రనౌత్ లాంటి హీరోయిన్లు మద్దతుగా నిలవగా, మరికొందరు విమర్శిస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పాయల్ ఆరోపణలపై సీనియర్ హీరోయిన్ కస్తూరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాయల్ ఆరోపణలపై ఆమె లా పాయింట్ తీశారు. దీంతో కొందరు నెటిజన్లకు కోపం వచ్చి .... ఇదే మీ కుటుంబ సభ్యులకు జరిగితే అనే ప్రశ్న వేయడంతో ... ఎట్టకేలకు నిజాన్ని బయట పెట్టాల్సి వచ్చింది.
‘అనురాగ్పై పాయల్ ఆరోపణలు న్యాయస్థానంలో నిలబడవు. ఎందుకంటే ఎలాంటి ఆధారాలు లేకుండా లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు’ అని కస్తూరి ట్వీట్ చేశారు. సెలబ్రిటీల ట్వీట్లపై నెటిజన్లు వెంటనే స్పందిస్తుండం చూస్తున్నాం. కస్తూరి ట్వీట్పై ఓ నెటిజన్ స్పందిస్తూ ... ‘ఇదే పరిస్థితి మీ కుటుంబంలో ఎవరికైనా ఎదురైతే ఇట్లే మాట్లాడతారా?’ అని ప్రశ్నించాడు.
దీంతో కస్తూరి షాక్కు గురయ్యారు. వెంటనే ఆమె తేరుకుని స్పందించారు. ‘నా కుటుంబంలో ఏంటి? నేనే అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాను. నేను కూడా లైంగిక వేధింపుల బాధితురాలినే’ అని సమాధానం ఇచ్చారు. మనసులో ఆ ఆవేదన ఉండడం వల్లే కస్తూరి పాయల్ ఆరోపణలపై స్పందించినట్టు ఇప్పుడు అర్థమవుతోంది. మొత్తానికి మనసులో భారంగా ఉన్న ఓ నిజాన్ని ఎట్టకేలకు కస్తూరి బయట పెట్టారు.