సామ్రాట్ కళ్లల్లో కళ్లుపెట్టి చూస్తే తప్పేంటి

బిగ్ బాస్ సీజన్-2లో వివాదాలన్నీ ఒకెత్తు. సామ్రాట్-గీతామాధురి మధ్య నడిచిన వ్యవహారం మరో ఎత్తు. ఆల్రెడీ పెళ్లైన గీతామాధురి, షోలో సామ్రాట్ తో అలా రాసుకుపూసుకు తిరగడం జనాలకు నచ్చలేదు. మరీ ముఖ్యంగా రాత్రివేళల్లో చేతుల్లో చేయివేసుకొని ఏకాంతంగా గుసగుసలాడుకోవడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయారు. 

అప్పట్లో ఈ వ్యవహారంపై చాలా పెద్ద దుమారం చెలరేగింది. సోషల్ మీడియాలో వీళ్లిద్దరి వ్యవహారశైలిపై ఎన్నో పుకార్లు, మరెన్నో విమర్శలు, ఇంకెన్నో సెటైర్లు పడ్డాయి. బిగ్ బాస్ సీజన్-2 ముగిసింది. గీతామాధురి బయటకొచ్చింది. అప్పటి వివాదంపై రియాక్ట్ అయింది. 

"ఓ మనిషి కళ్లల్లో కళ్లు పెట్టి చూడకుండా జుట్టు, ముక్కు చూసి మాట్లాడలేం కదా. ఓ గేమ్ ఆడుకుంటున్నప్పుడు ఏదో నవ్వుతూ మాట్లాడుకుంటాం. అంతకు ముందే అమిత్ భయ్యాతో ఆ గేమ్ ఆడాను. సామ్రాట్ తోనే ఎందుకు ఆ రూమర్లు వచ్చాయో అర్థం కావడం లేదు."

ఇలా అప్పటి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది గీతామాధురి. తన భర్త నందూకు తానేంటో తెలుసని, ఈ వ్యవహారంపై తనను నందు ప్రశ్నించలేదని అంటోంది.

"సామ్రాట్ తో నేనేదో క్లోజ్ గా ఉన్నట్టు చాలామంది ఫీల్ అయ్యారు. దీనిపై నందు నన్నేమీ అడగలేదు. నందుకి నేనేంటో తెలుసు. ప్రతిది నందుతో షేర్ చేసుకుంటాను. నేను అందరితో ఈక్వెల్ గానే ఉన్నాను. కానీ కేవలం సామ్రాట్ తో నేను కలిసున్న సన్నివేశాల్ని మాత్రమే ప్లే చేశారు." 

అలా అని సామ్రాట్ ను సోదరుడిగా కూడా అంగీకరించడం లేదు గీతామాధురి. రియాలిటీ షోలో రాఖీ కట్టినంత మాత్రాన బ్రదర్ అయిపోడని.. తనకు, సామ్రాట్ కు మధ్య ఉన్న అనుబంధం ఇంకెంతో పెద్దదని చెప్పుకొచ్చింది.

"చాలీచాలని ఫుడ్ తిని, మేం ఎలా ఎడ్జెస్ట్ అయ్యామో మాకు తెలుసు. ఆ బాండింగ్ వేరే. మాది మేమే తిని, మేమే కొట్టుకొని, మేమే కలిసిపోయి ఉన్నాం. మా బాండింగ్ గురించి మాకు తెలుసు. ఆ బాండింగ్ ను రకరకాలుగా చూస్తే నేనేం చేయలేను." 

అప్పట్లో నడిచిన వివాదం సంగతేమో కానీ, తాజాగా గీతామాధురి మాట్లాడిన మాటలు మాత్రం మరోసారి దుమారం రేపేలా ఉన్నాయి. బిగ్ బాస్ తనకు ఎన్నో నేర్పించిందని, మరెన్నో కొత్త బంధాల్ని అందించిందని చెబుతున్న గీతామాధురి, బిగ్ బాస్ అంటూ తన ఒంటిపై వేయించుకున్న టాటూను తొలిగించనని అంటోంది. 

Show comments