ఎక్స్ క్లూజివ్ - కృష్ణ వంశీ-రుద్రాక్ష

క్రియేటివ్ డైరక్టర్ కృష్ణ వంశీ చాలా గ్యాప్ తరువాత మళ్లీ డైరక్టర్ సీట్ లోకి వస్తున్నారు. రుద్రాక్ష అనే సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇదే సినిమాకు మరో విశేషం ఏమిటంటే, ఒకప్పుడు భారీ సినిమాలు తీసిన నిర్మాత బండ్ల గణేష్ చాలా గ్యాప్ తరువాత నిర్మాతగా రాబోతున్నారు. 

ఈ ఇద్దరు కలిసి గతంలో గోవిందుడు అందరి వాడేలే అనే సినిమాను అందించిన సంగతి తెలిసిందే. రుద్రాక్ష సినిమా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అని తెలుస్తోంది. టాప్ హీరోయిన్ కోసం ప్రయత్నిస్తున్నారు. అది ఓకె అయితే సినిమా అనౌన్స్ మెంట్ బయటకు వస్తుంది. 

కృష్ణ వంశీ చాలా టైమ్ తీసుకుని, పూల్ ఫ్రూఫ్ స్క్రిప్ట్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఈ స్క్రిప్ట్ ను నిర్మాత దిల్ రాజు కూడా విని బాగుందని మెచ్చుకున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలో ఈ సినిమా సెట్ మీదకు వెళ్లే అవకాశం వుంది.

బాబుపై కేసుల విచారణకు ఇక అవరోధాలు లేవు

Show comments