మూడేళ్ల ప్రేమకు హీరో, హీరోయిన్ బ్రేకప్?

మూడేళ్ల నుంచి ప్రేమ పక్షులుగా విహరించారు టైగర్ ష్రాఫ్, దిశా పటానీ. ఈ మూడేళ్లలో వీరిద్దరూ కెరీర్ పరంగా బ్రహ్మాండంగా రాణించారు. మంచి మంచి అవకాశాలు పొందారు. స్టార్లుగా ఎదిగారు. ఇద్దరి కెరీర్లూ దేదీప్యమానంగా కొనసాగాయి. కలిసి నటించారు. అలాగే జంటగా విహరించారు. ప్రేమలో మునిగి తేలారు. తమ ప్రేమను వీరు రహస్యంగా ఉంచడానికి కూడా ప్రయత్నించలేదు. ఎంచక్కా జంటగానే కనిపించారు.

అయితే ఇప్పుడు వీరి ప్రేమకథలో ట్విస్ట్ చోటు చేసుకుందని వార్తలు వస్తున్నాయి. టైగర్, దిశాలు విడిపోయారట! ఇన్నాళ్ల ప్రేమకు వీరిద్దరూ ఫుల్ స్టాప్ పెట్టేశారని, ఎవరి దారు వారు చూసుకుంటూ ఉన్నారని సమాచారం. ఇన్నాళ్లూ జంటగా తిరిగిన వీళ్లిద్దరూ ఇక జంటగా కనిపించరని బాలీవుడ్ మీడియా చెబుతూ ఉంది.

మూడేళ్ల నుంచి ప్రేమలో విహరిస్తున్నా వీరిద్దరూ ఆ విషయాన్ని అధికారికంగా ఎప్పుడూ ప్రకటించలేదు. మీడియా అడిగినా సమాధానాలను దాటవేస్తూ వచ్చారు. అయితే జంటగా తిరగడం మాత్రం కొనసాగించారు. ఇప్పుడు బ్రేకప్ విషయాన్ని కూడా వీరు అఫిషియల్ గా అనౌన్స్ చేసే అవకాశాలు ఏవీలేనట్టే.

బాలీవుడ్ లో ఇలాంటి ప్రేమలు, బ్రేకప్ప్ కొత్తవి ఏమీకావు కదా, అక్కడి ఎన్నో ప్రేమ వ్యవహారాల్లో ఇదీ ఒకటి!

తెలుగుదేశం కథ ముగిసిందా?.. బడాయికి పోతున్న బీజేపీ

Show comments