రాపాక రచ్చ.. సంభ్రమాశ్చర్యాల్లో జనసైనికులు

పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓడిపోయి తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కూడా రాపాక వరప్రసాద్ కి ఇంత పబ్లిసిటీ రాలేదు. కానీ అసెంబ్లీలో ఒకే ఒక్క స్పీచ్ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయారు. జగన్ దేవుడంటూ రాపాక చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. తెలిసే మాట్లాడాడో, లేక టాక్ట్ ఫుల్ గా మాట్లాడాడో తెలియదు కానీ రాపాక మాత్రం తన ప్రసంగంతో సంచలనం సృష్టించాడు.

అయితే జనసైనికులు మాత్రం ఈ ప్రసంగాన్ని ఎలా అన్వయించుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రసంగాన్ని అడ్డుపెట్టుకుని మిగతా పార్టీల అభిమానులు సోషల్ మీడియాలో జనసైనికుల్ని రెచ్చగొడుతున్నారు. జనసేనకు ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా పోయాడంటూ సెటైర్లు వేస్తున్నారు. జగన్ కు జైకొట్టేశాడు, ఇక పార్టీ మారబోతున్నాడంటూ మహూర్తాలు కూడా పెట్టేస్తున్నారు.

జనసేన పార్టీ, బడ్జెట్ ను అంతలా విమర్శిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే జనసేన ఎమ్మెల్యే ఏకంగా బడ్జెట్ భగవద్గీత అంటూ అసెంబ్లీలో సర్టిఫికెట్ ఇవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు కొంతమంది.   జనసైనికులు మాత్రం తమకి కావాల్సిన పాయింట్ మాత్రమే తీసుకుని సంబరపడిపోతున్నారు. అసెంబ్లీలో జగన్ ని ధైర్యంగా నిలదీసిన జనసేన ఎమ్మెల్యే అంటూ సొంత భాష్యం చెప్పుకుంటున్నారు. ఈ విషయానికి జనసేనకి చెందిన 99టీవీ కూడా వంత పాడుతోంది. జగన్ ని ప్రశ్నించిన జనసేన ఎమ్మెల్యే అంటూ స్టోరీలు నడిపించుకుంటున్నారు.

రాపాక జగన్ ని పొగిడారా, ప్రశ్నించారా అనే విషయం ఆయన ప్రసంగం వింటే ఈజీగా అర్థమవుతుంది, అయితే దాన్ని జీర్ణించుకోడానికే జనసైనికులకు మనసొప్పడంలేదు. పోనీ వ్యతరేకిద్దామా అంటే చెప్పుకోడానికి ఉన్నది ఒకే ఒక్క ఎమ్మెల్యే, పార్టీ అధినేత నిర్ణయం తెలుసుకోకుండా ఎలా స్పందించాలో తెలియక సతమతమవుతున్నారు జనసైనికులు.

మొత్తమ్మీద జనసేనలో రాపాక రచ్చ మొదలైంది. జనసైనికులు మాత్రం ఎమ్మెల్యేపై వస్తున్న ట్రోలింగ్స్ ని తట్టుకోలేకపోతున్నారు. బాలయ్య బాబు మాటల్లో చెప్పాలంటే సంభ్రమాశ్చర్యాల్లో మునిగితేలుతున్నారు. 

బ్యూటిఫుల్ హీరోయిన్ తో క్యూట్ యాంకర్ ఇంటర్వ్యూ

పూరి చూసిన ఎత్తుపల్లాలు ఏమిటి

Show comments