50 యేళ్ల హీరోయిన్.. ఇంత అందంగా!

తెలుగు సినీ ప్రేక్షకులు అంత ఈజీగా మరిచిపోలేని హీరోయిన్లలో ఒకరు దీప్తీ భట్నాగర్. ‘పెళ్లి సందడి’ సినిమాలో స్వప్న సుందరిగా, ‘ఆటోడ్రైవర్’లో మిస్ ఇండియాగా ఆకట్టుకున్న దీప్తి నటించింది తక్కువ సినిమాలే అయినా అలా గుర్తుండిపోతుంది. సినిమాలకు చాలా సంవత్సరాల కిందటే పుల్‌స్టాప్ పెట్టేసిన ఈ నటీమణి చక్కగా పెళ్లి చేసుకుని సెటిలైంది. ఇద్దరు పిల్లలు కూడా.

మరీ ఖాళీగా ఉండకుండా ఒక ట్రావెలాగ్ చేస్తున్నట్టుగా ఉంది. ఆ కార్యక్రమం కూడా హిట్టైంది. ఇక తాజాగా దీప్తి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు ఆశ్చర్యపరచకమానవు. ఈమెకు 50 యేళ్లు వయసు వచ్చినా అందం వన్నె తగ్గలేదని స్పష్టం అవుతోంది. చాలామంది నటీమణులు లేటు వయసులో కూడా గ్లామరస్ గా కనిపించడం చూశాం కానీ... 50 యేళ్ల వయసులో కూడా ఇంకా ఇలా కనిపించగలగడం మాత్రం దీప్తీకే సాధ్యం అవుతున్నట్టుగా ఉంది.!

Show comments