'చిత్ర'-'లహరి' ప్రారంభం

సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ సినిమాకు క్లాప్ పడింది. కిషోర్ తిరుమల డైరక్షన్ లో మైత్రీ మూవీస్ నిర్మించే ఈ సినిమాను ఈరోజు ప్రారంభించారు. వరుస పరాజయాల తరువాత సాయిధరమ్ తేజ్ కాస్త గ్యాప్ తీసుకుని, అమెరికాలో ఫిట్ నెస్ ట్రయినింగ్ తీసుకుని, గెడ్డం పెంచి, కాస్త కొత్త లుక్ తో షూటింగ్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. హలో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణి ప్రియదర్శన్ ఈ సినిమాలో హీరోయిన్.

మంచి సినిమాటోగ్రాఫర్ గా పేరు సాధించిన కార్తీక్ ఘట్టమనేని, మ్యూజిక్ మాంత్రికుడు దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు పని చేస్తున్నారు. దేవీ-సాయిధరమ్ కాంబినేషన్ లో ఇదే ఫస్ట్ సినిమా. నవంబర్ 2 నుంచి రెగ్యులర్ షూట్ స్టార్ట్ అవుతుంది. సింపుల్ గా జరిగిన పూజా కార్యక్రమానికి దర్శకుడు కొరటాల శివ, మైత్రీ నిర్మాతలు నవీన్, రవిశంకర్, హాజరయ్యారు.

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి 

Show comments