చైతూ సినిమాకు పూజ

చైతన్య ఫుల్ స్పీడ్ మీద వున్నాడు. ఒకపక్క వెంకీమామ సినిమా చేస్తూనే మరో సినిమా స్టార్ట్ చేసేసాడు. శేఖర్ కమ్ముల డైరక్షన్ ఆసియన్ సునీల్ నిర్మించే సినిమాకు ఈరోజు పూజ చేసేసారు. సికిందరాబాద్ గణేష్ టెంపుల్ లో ఈ సినిమాకు పూజా కార్యక్రమం నిర్వహించారు. విశాఖలో వెంకీమామ షూటింగ్ కు వెళ్లే హడావుడిలో వున్న చైతన్య, ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే హీరోయిన్ సాయిపల్లవి కూడా హాజరయ్యారు.

స్క్రిప్ట్ రెడీగా వుండడంతో, హీరో డేట్ లు వచ్చేలోగా మిగిలిన ప్రీ ప్రొడక్షన్ పనులు అన్నీ చకచకా చేసేయాలన్న ఉద్దేశంతో సినిమాకు పూజ నిర్వహించారు. వెంకీ మామ పూర్తవడంతోనే చైతన్య ఈ సినిమా సెట్ మీదకు వస్తారు.

ఈ సినిమా నృత్య ప్రధానమైన కథతో నడుస్తుంది. హీరో హీరోయిన్లు ఇద్దరూ డ్యాన్సర్లుగా కనిపిస్తారు. వీలయినంత త్వరగా ఈ సినిమాను ఫినిష్ చేయాలన్నది ఇటు హీరో, అటు డైరక్టర్ సంకల్పం. చైతన్య చేతిలో చాలా సినిమాలు వున్నాయి. ముఖ్యంగా స్వంత సినిమా బంగార్రాజు స్టార్ట్ చేయాలి. అందుకే తన సినిమా షూటింగ్ లకు ఎక్కడా గ్యాప్ ఇవ్వడంలేదు.

వెంకీమామ సినిమా ఇప్పటికే యాభైశాతం పూర్తయింది. ఈ రోజు నుంచి విశాఖలో షెడ్యూలు మొదలవుతుంది.

నాగచైతన్య కొత్త సినిమా ఓపెనింగ్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి

Show comments