బుర్రకథ ఎప్పటికి వాయిదా?

ఆది సాయికుమార్ - డైమండ్ రత్నం కాంబినేషన్ లో తయారైన బుర్రకథ వ్యవహారం ఇబ్బందుల్లో పడినట్లు కనిపిస్తోంది. సెన్సారు కాకపోవడమే అందుకు కారణం. ప్రస్తుతం వున్న సెన్సారు అధికారి చాలా స్ట్రిక్ట్ గా వుంటున్నారు. పద్దతులు పాటించకుండా సినిమాలు చూడడంలేదు. ఈవారం మూడు సినిమాలు విడుదల కావాల్సి వుండగా రెండే సెన్సారు గండం దాటాయి.

వాటిల్లో కూడా ఓ సినిమాకు కేంద్రం నుంచి కాస్త గట్టి సిఫార్సు రావడంవల్ల పని సాధ్యమైంది లేదూ అంటే ఈవారంలో రావాల్సిన మూడు సినిమాల్లో రెండు వాయిదాపడేవి. బుర్రకథ విషయంలో వేరే గ్యాసిప్ కూడా వినిపిస్తోంది.

ఈ సినిమా కూడా గట్టెక్కే అవకాశం వుండేదని, వేరే వత్తిడులు వచ్చి, సెన్సారు అధికారి అస్సలు రూల్స్ దాటకుండా, దాని మీదే వుండిపోయారని ఇండస్ట్రీలో గ్యాసిప్ వినిపిస్తోంది. బుర్రకథ టీమ్ ఈ సాయత్రం 29న విడుదల అని ప్రకటించింది. కానీ అంతలోనే విడుదల డేట్ త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.

ఇండస్ట్రీ వర్గాల బోగట్టా ప్రకారం రేపు (గురువారం) కూడా సెన్సారు అయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. అందువల్ల బుర్రకథ వెళ్లి 'ఓ బేబీ', రాజ్ దూత్ సినిమాలతో పోటీపడాల్సి వుంటుంది.

తెలుగుదేశం కథ ముగిసిందా?.. బడాయికి పోతున్న బీజేపీ