అన్ని కమర్షియల్ మసాలాలు దట్టించడంతో పాటు హీరోయిజమ్ దండిగా పండించడం బోయపాటి సక్సెస్ థియరీ. 'వినయ విధేయ రామ' చిత్రాన్ని కూడా తనదైన రీతిలో తెరకెక్కిస్తున్నాడనేది టీజర్తో క్లియర్ అయిపోయింది. అయితే ఈ చిత్రం పూర్తి కాకముందే రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి చేస్తోన్న మల్టీస్టారర్ షూటింగ్ మొదలు కావడంతో 'వినయ విధేయ రామ'కి ముందుగా ప్లాన్ చేసుకున్న ఐటెమ్ సాంగ్ తీయరేమో అనే అనుమానాలొచ్చాయి.
అయితే తన సినిమాలో ఐటెమ్ సాంగ్ లేకుండా ఎలాగంటూ బోయపాటి ససేమీరా అంటున్నాడట. నాలుగు రోజుల్లో పాట తీసేయవచ్చు కనుక, ఇంకా విడుదలకి ఎనిమిది వారాల వరకు వుంది కనుక ఆ పాటని తీయాల్సిందేనని డిసైడ్ చేసాడట. అయితే ఈ ఐటెమ్ సాంగ్లో నటించే తార ఎవరనేది ఇంకా డిసైడ్ అవలేదు.
ఎవరైనా టాప్ హీరోయిన్తో ఈ పాట చేయించాలని చూస్తున్నారు. సరైనోడులో బ్లాక్బస్టర్ సాంగ్కి మించిన ట్యూన్ దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసాడని, ఈ చిత్రంలో మాస్ పాటలు, చరణ్ డాన్సులు ప్రత్యేక ఆకర్షణ అవుతాయని చిత్ర బృందం చెబుతోంది. సంక్రాంతికి విడుదలవుతోన్న ఏకైక మాస్ చిత్రం ఇదే కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.