ఫస్ట్ షాట్ కే బోయపాటి మార్క్ పడిందిగా!

‘నువ్వొక మాటంటే అది ‘శబ్దం’ అదే మాట నేనంటే అది ‘శాసనం‘

ఈ డైలాగ్ తో బాలయ్య సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఇలా మొదటి షాట్ కే తన మార్క్ చూపించాడు. పైగా ఇది బాలయ్య సినిమా కూడా కావడంతో.. మూవీలో ఇలాంటి డైలాగ్స్ బోలెడన్ని ఉంటాయని మచ్చుకు ఒకటి ఓపెనింగ్ రోజే చూపించాడు.

బాలయ్య-బోయపాటి కాంబోలో సినిమా లాంచ్ అయింది. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు బి.గోపాల్ క్లాప్ కొట్టగా, అంబికా కృష్ణ కెమెరా స్విచాన్ చేశారు. కథల నుంచి సినిమాలు పుట్టుకొస్తాయని, కానీ ఈ కొత్త సినిమా తన ఆవేశం, బోయపాటి ఆవేశం నుంచి పుట్టుకొచ్చిందని చెప్పుకొచ్చాడు బాలయ్య.

సింహా, లెజెండ్ లాంటి రెండు బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలయ్య-బోయపాటి కాంబోలో వస్తున్న సినిమా ఇది. అయితే అలాంటి అంచనాలు తమపై ఎప్పుడూ ఉండవంటున్నాడు.

"బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో సింహా, లెజెండ్‌ సినిమాలు చేయడం, అద్భుతమైన విజయాలు అందుకోవడం జరిగింది. మా కాంబినేషన్‌లో సినిమా అనగానే ప్రేక్షకుల్లో, అభిమానుల్లో చాలా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉంటాయి. అయితే  నాది, బోయపాటిది సిద్ధాంతం ఏంటంటే గతం గతః. మేము చేసిన సినిమాల గురించి మాట్లాడుకోకుండా పూర్తి కాన్సన్‌ట్రేషన్‌ మా నెక్స్‌ట్‌ మూవీ మీదనే ఉంచుతాం."

ఈ సినిమాకు ఇంకా హీరోయిన్లను ఫిక్స్ చేయలేదు. తమన్ సంగీతం అందించబోతున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జనవరి నుంచి ప్రారంభమౌతుంది.

Show comments