కులాల మధ్య చిచ్చును కొనసాగిస్తున్నాడు!

ఇంకా అవే మాటలు.. గత ఎన్నికల ముందు అడ్డగోలుగా కులాల వారీగా హామీలు ఇచ్చి.. చిచ్చును రేపిన చంద్రబాబు నాయుడు ఇప్పుడూ అదే తీరును కొనసాగిస్తూ ఉన్నాడు. గత ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు కులాల వారీగా మెనిఫెస్టోని విడుదల చేశాడు. ప్రతి కులానికీ రకరకాల హామీలు ఇచ్చాడు. ఇలా కులాల వారీగా హామీలు ఇవ్వొచ్చని రాజకీయ నేతలకు పాఠాలు నేర్పాడు చంద్రబాబు నాయుడు.

కాపులకు బీసీ హోదా, కురుబలకు ఎస్టీ హోదా, రజకులకు ఎస్సీ హోదా.. ఇవీ చంద్రబాబు నాయుడు గత ఎన్నికల హామీలు. అయితే వీటిని ఏ మేరకు నెరవేర్చాడో అందరికీ తెలిసిందే. కాపులకు రిజర్వేషన్లు అంటూ.. బీసీలకూ, కాపులకు చిచ్చుపెట్టాడు, కాపులకు బీసీ హోదాను ఇచ్చింది లేదు కానీ.. బీసీలతో కాపులకు వైరాన్ని పెట్టాడు.

తమ రిజర్వేషన్లను దొంగిలించడానికి కాపులు ప్రయత్నిస్తున్నారనే అకారణ ద్వేషాన్ని బీసీల్లో నింపాడు చంద్రబాబు. ఇలా విభజించి పాలించే రాజకీయాన్ని చేస్తున్నాడు. ఇప్పటికే కులాల వారిగా విడిపోయిన తెలుగు వాళ్లను మరింత కుల ఉచ్చులోకి దించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది.

ఇక కురుబలకు ఎస్టీ హామీలను ఇచ్చాడు. ఇప్పటికే ఎస్టీల్లో బంజారాలకు, గిరిజనులకు కొట్లాట ఉంది. దానికితోడు కురుబలను ఎస్టీలుగా మారుస్తానని చంద్రబాబు హామీని ఇచ్చాడు. దాన్ని నెరవేర్చలేదనుకోండి. ఇక రజకులను ఎస్సీలుగా చేరుస్తానని గతంలోనే చెప్పాడు. అదీ నెరవర్చలేదు.

ఇప్పుడు మళ్లీ మాట్లాడుతూ.. రజకులను ఎస్సీలుగా చేర్చేందుకు తను కట్టుబడి ఉన్నానని ప్రకటించాడు. దటీజ్ చంద్రబాబు నాయుడు. కులాల మధ్యన చిచ్చును కొనసాగిస్తూ ఉండటమే తన పని అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు.

Show comments