అనుష్క అలసిపోయింది, ఇక ఆ సినిమాలకు నో!

హిస్టారిక్ నేపథ్యంతో రూపొందే సినిమాలకు ఇక నో అంటోంది నటి అనుష్కా షెట్టి. ఈ మేరకు తన తాజా ఇంటర్వ్యూలో తదుపరి సినిమాల ఎంపిక గురించి స్పందించింది. ఈ మధ్య కాలంలో జానపద-చారిత్రక వంటి కథాంశాల సినిమాలు వస్తున్నాయంటే అందులో అనుష్క తప్పనిసరి అయిపోయింది!

బాహుబలి, రుద్రమదేవి వంటి సినిమాలతో పాటు.. 'సైరా నరసింహారెడ్డి'లో కూడా ఆమె స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చింది. అయితే సైరాలో కూడా అనుష్క డల్ గానే కనిపించింది. ఆ మేరకే ఆమె మాట్లాడుతూ ఉంది.

ఇక చారిత్రాత్మక, జానపద సినిమాల్లో ఇక నటించే ఓపిక తనకు లేదని అనుష్క అంటోంది. ఆ సినిమాల్లో నటించాలంటే బోలెడంత సమయం వెచ్చించాలని, చాలా కష్టపడాలని, మేకప్ కు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుందని.. దీంతో ఎక్కువ సమయం పడుతుందని, అందుకే ఇక అలాంటి సినిమాల్లో నటించే ఉద్దేశం లేదని అనుష్క ఆ ఇంటర్వ్యూలో చెప్పింది.

మణిరత్నం తమిళంలో తీస్తున్న 'పొన్నియన్ సెల్వన్' అదే తరహా సినిమానే. అందులో అనుష్క నటిస్తున్నట్టుగా మొదట ప్రచారం జరిగింది. ఆ తర్వాత అందుకు ఖండన వచ్చింది. చూస్తుంటే అనుష్క ఆ సినిమాకు నో చెప్పినట్టుగా ఉంది!