14 రీల్స్ నుంచి దిల్ కాంపౌండ్ కు

డైరక్టర్ పరుశురామ్-మహేష్ బాబు సినిమా వ్యవహారం ఫైనల్ అయిపోవడంతో హీరో నాగ్ చైతన్య సినిమా సంగతి కూడా మారిపోయింది. పరుశురామ్ డైరక్షన్ లో 14రీల్స్ ప్లస్ తో చేసే సినిమా ఇక లేదు. అందుకే నాగ్ చైతన్య ఆ డేట్ లు నిర్మాత దిల్ రాజుకు ఇచ్చేసారు. రైటర్ కమ్ డైరక్టర్ బివిఎస్ రవి అందించిన కథతో తయారయ్యే కథను చైతన్య ఒకె చేసినట్లు బోగట్టా.

ఈ కథను దర్శకుడు విక్రమ్ కుమార్ డైరక్ట్ చేస్తారు. నిజానికి ఈ ప్రాజెక్టు చిరకాలంగా వార్తల్లో నలుగుతోంది. ఎప్పడయితే పరుశురామ్ ప్రాజెక్టు క్యాన్సిల్ అయిందో దీనికి మార్గం సుగమం అయింది. అయితే ప్రస్తుతం కరోనా వ్యవహారం నడుస్తోంది. షూటింగ్ లు ఎప్పుడు వుంటాయో? సినిమాలు ఎప్పుడు వుంటాయో తెలియదు. అందువల్ల అలా అబేయన్స్ లో వుంది.

చైతన్య ప్రస్తుతం చేస్తున్న లవ్ స్టోరీ వ్యవహారం కొలిక్కి వచ్చేస్తే, అప్పుడు ఈ ఫ్రాజెక్టు షురూ అవతుంది. అప్పటి వరకు వార్తల్లో వుంటుంది. అక్కినేని హీరోతో విక్రమ్ కుమార్ కు ఇది రెండో సినిమా అవుతుంది. గతంలో మనం లో చైతన్య నటించాడు. చైతన్య కాకుండా మిగిలిన అక్కినేని హీరోలు నాగ్, అఖిల్ చెరో సినిమా విక్రమ్ కుమార్ తో చేసారు.

ఇంట్లోనే ఉందాం కరోనాని కట్టడి చేద్దాం

'విశ్వక్' మూవీకి నాకు సంబంధం..?

Show comments