31న నాని కొత్త సినిమాకు శ్రీకారం

మైత్రీ సంస్థ మాజీ భాగస్వామి, ఎన్నారై సి వి మోహన్ నిర్మాతగా తొలి సినిమాకు శ్రీకారం చుడుతున్నారు. నాని హీరోగా శౌర్య అనే కొత్త దర్శకుడితో సినిమా ప్రారంభిస్తున్నారు. ఈ సినిమ పూజ ఈనెల 31న జరుగుతుంది. మృణాళిని ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. 

నాని నటించే ముప్పయ్యవ సినిమా ఇది. తెలుగులో ఖుషి సినిమాకు పని చేస్తున్న బాలీవుడ్ సంగీత దర్ళకుడు అబ్దుల్ వాహబ్ ఈ సినిమాకు పని చేస్తున్నారు.

31న ఫార్మల్ గా పూజ జరుపుకుని, ఒకటి నుంచి కంటిన్యూ షెడ్యూలు కు వెళ్తారు. ఓ వైవిధ్యమైన కథాంశంతో తయారవుతుందీ సినిమా. దసరా సినిమా తరువాత నాని ఓకె చేసిన సినిమా ఇది. దసరా సినిమా మాదిరిగానే దీనికి కూడా కొత్త దర్ళకుడు పని చేస్తున్నారు. ఒక సినిమా తరువాత మరో సినిమా చేస్తూ వస్తున్న నాని, ఇటీవలే దసరా సినిమా పూర్తి చేసారు.

జెర్సీ సినిమా ముందు వెనుక హిట్ లు లేక ఇబ్బంది పడుతున్నాడు నాని. శ్యామ్ సింగరాయ్ ఒకటే ఊరట. ఏది చేస్తే హిట్ చేతిలో పడుతుందో అని ప్రతి ఒక్కటీ టచ్ చేస్తూ వస్తున్నాడు. అందులో ఇది లేటెస్ట్ అన్నమాట.