తండ్రికి కరోనా.. ఖండించిన హాట్ హీరోయిన్

బాలీవుడ్ బాంబ్ షెల్ దిశా పటానీ తండ్రికి కరోనా పాజిటివ్ వచ్చిందట. వెంటనే ఆయన్ను హాస్పిటల్ కు తరలించారట. ఈరోజు ఉదయం నుంచి వైరల్ అవుతున్న ఈ వార్తను ఈ హాట్ హీరోయిన్ ఖండించింది. తన తండ్రి జగదీశ్ సింగ్ పటానీపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలంటోంది ఈ హీరోయిన్.

ఉత్తరప్రదేశ్ లోని విద్యుత్ శాఖకు చెందిన విజిలెన్స్ డిపార్ట్ మెంట్ లో దిశా పటానీ తండ్రి డిప్యూటీ ఎస్పీ హోదాలో ఉన్నారు. రాష్ట్రంలో జరిగిన ట్రాన్స్ ఫార్మర్ల కుంభకోణంపై విచారణ చేపట్టేందుకు ఆయనతో పాటు మరో ఇద్దరు అధికారులు ఈమధ్య లక్నో వెళ్లి వచ్చారని, ఆ వెంటనే వీళ్లకు కరోనా సోకినట్టు వార్తలు వచ్చాయి.

ఈ వార్తల్ని కొద్దిసేపటి కిందట దిశా పటానీ టీమ్ ఖండించింది. జగదీశ్ సింగ్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని స్పష్టంచేసింది.

మరోవైపు దిశా మాత్రం తల్లిదండ్రులకు దూరంగా ఉంటోంది. లాక్ డౌన్ స్టార్ట్ అయినప్పట్నుంచి ముంబయిలోని ఆమె బాయ్ ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్ ఇంట్లో సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటోంది. వీళ్లిద్దరి ఎఫైర్ బాలీవుడ్ లో ఓపెన్ సీక్రెట్ అనే సంగతి తెలిసిందే.

వరుణ్ తేజ్ హీరోగా నటించిన లోఫర్ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది దిశా పటానీ. ఆ వెంటనే బాలీవుడ్ కు షిఫ్ట్ అయింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సరసన రాధే సినిమా చేస్తోంది ఈ బ్యూటీ. 

విజయవాడ వీధుల్లో తొడ కొట్టాను