అంథాదూన్ కు ఎవరు?

భీష్మ సినిమా హిట్ ఇచ్చిన కిక్ తో అంథాదూన్ రీమేక్ కు శ్రీకారం చుడుతున్నాడు హీరో నితిన్. తన్ స్వంత బ్యానర్ మీద ఈ సినిమా నిర్మిస్తారు. అయితే ఇప్పటికీ సినిమాలో కీలకపాత్రకు ఎవరు అన్నది డిసైడ్ కాలేదు. అంథాదూన్ లో టబు చేసిన క్యారెక్టర్ చాలా కీలకమైనంది. ఫార్టీస్ లో వుండి, వ్యాంప్ లుక్స్ వున్న క్యారెక్టర్ అది. టబును తీసుకోవడం ఇష్టం లేదు. ఇక ఎవరు అన్నది డిస్కషన్లు నడుస్తున్నాయి.

చాలా పేర్లు పరిశీలనలో వున్నాయి. జ్యోతిక, స్నేహ దగ్గర నుంచి రమ్యకృష్ణ, మంచులక్ష్మి ఇలా చాలా పేర్లు. ఈ లిస్ట్ లో సిమ్రాన్, యాంకర్ అనసూయ పేర్లు కూడా వున్నాయి. ఇలియానా అయితే బాగుంటుంది కానీ ఆమె ఇలాంటి క్యారెక్టర్ చేస్తుందా అన్నది అనుమానం.  రెజీనా ఓకె కానీ ఎవరు సినిమాలో సేమ్ క్యారెక్టర్ చేసేసింది. 

సినిమా ముహుర్తం అయితే 24న చేస్తున్నారు. కానీ అసలు క్యారెక్టర్ ను  ఫిక్స్ చేయడానికి ఇంకా టైమ్ పడుతుంది. ఈ లోగా నితిన్ రంగ్ దే, చెక్ సినిమాలు ఫినిష్ చేసేస్తాడు. 2020 లో నితిన్ నుంచి మూడు సినిమాలు కచ్చితంగా విడుదల వుంటుంది. నాలుగోది కూడా వుండే అవకాశం వుంది. 

భీష్మ సినిమా తరువాత రంగ్ దే విడుదలవుతుందా? చెక్ విడుదలవుతుందా?  అన్నది చూడాలి. భీష్మ విజయాన్ని క్యాస్ చేసుకోవడానికి చెక్ నిర్మాతలు ప్రయత్నించే అవకాశం వుంది. కానీ రంగ్ దే నే ముందు విడుదల చేయాలని నితిన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

అంతా మోడీ చెప్తేనే చేసాను.. నా తప్పు లేదు